యజమానుల చేతిలో చిత్రహింస
 


విద్యానగర్‌లోని యజమానుల చేతిలో చిత్రహింసకు గురైన బాలికను పోలీసులు సఖి కేంద్రానికి తరలించారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. బాలికకు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు. బ్యాంక్ ఉద్యోగులైన భార్యాభర్తలు.. ఏడాదిన్నరగా బాలికను చిత్రహింసలకు గురి చేశారు. స్థానికుల సహాయంతో బాలిక ఆ నరకం నుంచి బయటపడిన విషయం తెలిసిందే.